Pages

శ్వాస-ఆయుష్షు

శ్వాసకు.... ఆయుష్షు కూ ఉన్న సంబంధం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


మనిషి నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు.100 నుండి 120 సం.. బ్రతుకుతాడు. తాబేలు 3 సార్లు శ్వాస తీస్తుంది...500 సం. లు బ్రతుకుతుంది.

ఐతే శ్వాస లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగుతుంది....? దీనిని నేను స శాస్త్రీయంగా వివరిస్తాను.... అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.


మన శరీరం  కోట్ల కణాల   కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటానుకోట్ల కణాలు ఉంటాయి. వీటినే సెల్స్ అంటాం.

ఈ ప్రతి కణం లోనూ మైతోకాన్ద్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది.
ఈ మైతోకాన్ద్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. దీనిద్వారా ఉష్ణం జనిస్తుంది. ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణ శక్తి.ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివరవరకూ ఉన్న ప్రతి కణంలోనూ ఉష్ణం జనిస్తున్నది. ఇలా ఒక్కొక్క కణం నిముషానిక్ 15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.ఎందుకంటే మనం నిముషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాం కాబట్టి. ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పని చేసి తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది. ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరంలోంచి బయటకు వెళ్లిపోతాయి. ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో...ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది......ఉదాహరణకు మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి అనుకుంటే....ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్మి, మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే ఆ స్థలంలో కణాలు తయారవుతాయి. పాత వాటిని ఖాళీ చేస్తేనే ...కొత్తవి రాగల్గుతాయి. అందుకే ప్రతిదినం మన విసర్జన క్రియ అతి ముఖ్యమైనది. ఎవరైతే మాల విసర్జన సరిగా చెయ్యరో.... వారి శరీరం నిండా ఈ మృత కణాలు(toxins) నిండిపోయి...సరిగా ఉష్ణం జనించక.....తీవ్ర రోగాల బారిన పడతారు....కనుక ఈ టాక్సిన్ లను .....బయటికి పంపే డిటాక్సీఫీకేషన్(విసర్జన) చాలా ముఖ్యం.

ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది. అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 5 రోజులు జీవిస్తుంది....13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే....7 రోజులు జీవిస్తుంది.....ఈ విధంగా మనం శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ మన కణాలు పనిచేసే కాలం పెరుగుతుంది. ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పనిచేయిస్తే...త్వరగా పాడైపోతుంది.....పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పనిచేస్తుందో....అలాగే ఈ కణాలు కూడా.

భారతీయ యోగులు ...కణం యొక్క జీవిత కాలాన్ని 3 నుండి 21 రోజుల వరకు పెంచి 2100 సంవత్సరాలు కూడా జీవించగలిగారు.

మనం శ్వాసను ఎక్కువ తీసుకునేకొద్దీ....శరీరంలోని ప్రతీ కణంపై తీవ్ర పని ఒత్తిడి పడి... ఆ కణం త్వరగా పాడైపోతుంది. ప్రాణ యామ సాధన ద్వారా శ్వాసల సంఖ్యను తగ్గించి కణాల పనిరోజులని పెంచగల్గితే.....మన శరీరం లోని ప్రతి అవయం మరికొన్ని రోజులు ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే....అవయవాలు అంటే కణాల సముదాయమే.
ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క ఆయుష్షు పెరిగితే....మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.

మనం ఒక్క శ్వాసను తవగించ గల్గితే 20 సంవత్సరాల ఆయుష్షును పెంచుకోవచ్చు....
యోగులు ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే....తాము ఈరోజు మరణించేదీ....ముందే చెబుతారు.

కానీ ఒక్క శ్వాసను తగ్గించడం అనేది అంత సామాన్య విషయం కాదు....ప్రాణ యామం చెయ్యడం ముఖ్యం కాదు. ఏ ప్రాణం యామం తర్వాత ఏ ప్రాణాయామం చెయ్యాలి? అన్న సీక్వెన్స్ చాలా ముఖ్యం. తిరుమల కృష్ణమాచార్య లాంటి యోగులు ప్రాణాయామం , యోగ సీక్వెన్స్ లను తయారు చేశారు. పతంజలి అష్టాంగ యోగం నందు ఈ క్రమ పద్ధతి వివరం గా ఉంది. కానీ దాదాపు ఏ కొద్దిమంది కి మాత్రమే ఈ సీక్వెన్స్ గురించి తెలుసు.


క్రమబద్ధీకరణ తో కూడిన ప్రాణాయామమే గొప్ప ఫలితాలనిస్తుంది.

సాగర్ సింధూరి
మహర్షి సత్సంగ్.



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

No comments:

Post a Comment